మరో ప్రతిష్టాత్మక టెస్ట్ కు ఇండియా సిద్ధమయింది. వెండీస్ తో నేడు తొలి టెస్ట్ జరగనుంది. నెల రోజుల గ్యాప్ తర్వాత టీం ఇండియా ఆటగాళ్లు గ్రౌండ్ లోకి కాలు మోపుతున్నారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఇండియా – వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ ప ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరగనున్న ఈ మ్యాచ్ జయాపజయాలపై క్రికెట్ ఫ్యాన్స్ లో పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
ఇరు జట్లు బలంగానే…
విండీస్ పై సిరీస్ సాధించడమే తప్ప టీం ఇండియాకు ఓటమి ఎదురుకాలేదు. చివరి సారిగా 2001లో జరిగిన సిరీస్ ను మాత్రమే వెస్టిండీస్ సొంతం చేసుకుంది. అయితే మొత్తం 98 టెస్టులు ఇరు జట్లు ఆడగా భారత్ 22, విండీస్ 30 గెలవగా 26 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి.వెస్టండీస్ జట్టు సొంత మైదానంలో ఆడుతుండటంతో కొంత అడ్వాంటేజీ ఎలాగైనా ఉంటుంది. దానిని భారత్ అధిగమించి టెస్ట్ మ్యాచ్ ను గెలిచేలా పోరాడాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరుజట్లు సమఉజ్జీలుగా ఉండటంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.