జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై సినీ నటుడు, ఏపీ ఫిలిమ్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధ పడరా అని అయన పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. వాలంటీర్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారని వారిని గౌరవించక పోయిన పర్వాలేదు కానీ ఆడవాళ్లపై అగౌరవంగా మాట్లాడటం పవన్ కు మంచిది కాదు అని అయన అన్నారు . వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పదన్నారు. భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీయే కారణమన్నారు.
పవన్ ను టీడీపీ వాళ్లు పొరపాటున కూడా సీఎం కానివ్వరని . పవన్ కల్యాణ్ చంద్రబాబు గుప్పిట్లో ఉంటాడన్నారు . పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు టీడీపీ రూ.15 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టినప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశారు అని పోసాని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ తరపున చిరంజీవి చాలామందికి సారీ చెబుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ కు విలువలు ఉంటే వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.