ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టారు. కొద్దిసేపటి క్రితం ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పురంద్రీశ్వరికి పెద్దయెత్తున బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆమె మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి బాధ్యతలను స్వీకరించారు.
పార్టీ బలోపేతానికి…
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు సోము వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా పురంద్రీశ్వరి తెలిపారు. గతంలో పనిచేసిన అధ్యక్షుల నుంచి సూచనలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తానన్న పురంద్రీశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తుందన్న ఆమె కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా తమ పేర్లతో అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని అన్నారు.