హైదరాబాద్ జంట పేలుల్ల కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిందితులు నలుగురికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన నలుగురునిందితులు హైదరాబాద్ లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ నలుగురు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా పేలుళ్లు జరపడానికి రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయింది. పేలుళ్లు భారీగా చేపట్టేందుకు పెద్దయెత్తున పేలుడు సామగ్రి, ఆయుధాలను సమకూర్చుకున్నారని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానికి తెలిపారు. వారి వాదనలతో ఎన్ఐఏ న్యాయస్థానం ఏకీభవించింది.
జంట పేలుళ్లకు…
హైదరాబాద్ కు చెందిన ఒబేదుర్ రహ్మాన్, బీహార్ కు చెందిన ధనిష్ అన్సారీ, అప్తాబ్ అలాం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లు ఈ దారుణానికి ఒడిగట్టారని ఎన్ఐఏ పే్కొంది. వారణాసి ముంబయి, ఫైజాబాద్, లక్నోతో పాటు హైదరాబాద్ లో జంట పేలుళ్లు, జైపూర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సీరియల్ బ్టాస్ట్ ల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. 2013లో మార్చి నెలలో ఎన్ఐఏ అధికారులు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. పేలుళ్లకు కుట్రతో పాటు 2007లో జరిగిన గోకుల్ చాట్ పేలుళ్లు, 2013లో జరిగిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలోనూ వీరి ప్రమేయం ఉందని గుర్తించారు.