చంద్రయాన్ -3 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కౌంట్ డౌన్ ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 షార్ లోని రెండో వేదిక మీద నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
రికార్డులను…
ఎల్ వీఎం3-4 ఈ చంద్రయాన్ -3ను నింగిలోకి మోసుకెళ్లనుంది. వచ్చే నెల 23 లేదా 24వ తేదీల్లో సాఫ్ట్ లాండింగ్ అయ్యే అవకాశముందని శాస్త్ర్రవేత్తలు చెబుతున్నారు. గతంలో జరిగిన తప్పొప్పులు, వైఫ్యల్యాలు ఇందులో జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడిపై ల్యాండర్లను దింపిన నాలుగో దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. సోవియట్ యూనియన్, చైనా, అమెరికా సరసన భారత్ కూడా చేరనుంది.