జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నేత పై పోలీసులు చేయి చేసుకోవడాన్ని ఆయన్న తప్పుపట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న జనసైనికులపై పోలీసులు ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన నేత సాయిపై అక్కడి పోలీస్ ఇన్ స్పెకర్ట్ చెంప దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసులు వైసీపీకి…
జనసేన నేతలపై ఎక్కడ దాడులు జరిగినా తాము అక్కడకు వచ్చి తేల్చుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే త్వరలో శ్రీకాళహస్తికి వస్తున్నట్లు ఆయన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. కాళహస్తికి వెళ్లి అక్కడే తేల్చుకుంటానని, కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల్లాగా పోలీసులు మారిపోయి కనీసం శాంతియుత ఆందోళనలు చేయడానికి కూడా అనుమతివ్వకపోవడం ఏంటని నిలదీశారు. తాను కాళహస్తి వెళ్లి అక్కడే తేల్చుకుంటానని పవన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.