ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఓకే తెలిపింది. 26 రఫేల్ యుద్ధ విమానాలతో పాటు మూడు స్కార్పీన్ కు చెందిన సబ్ మెరైన్ లు కూడా కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరిన వెంటనే ఈ యుద్ధవిమానాల కొనుగోలు కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందించాల్సి ఉంటుంది.
90 వేలకోట్లు…
అలాగే నాలుగు శిక్షణ విమానాలు కూడా వస్తాయి. యుద్ధ విమానాలు, సబ్ మెరైన్ ల కొనుగోళ్కు తొంభయి వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒప్పందం తర్వాత మాత్రమే ఎంత ఈ యుద్ధ విమానాలపై ఖర్చు చేసిందీ బయట ప్రపంచానికి తెలియనుంది. ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. దీంతో పాటు ఫ్రాన్స్ కు చెందిన శాఫ్రాన్ కంపెనీ భారత్ తోకలసి విమానం ఇంజిన్ ను అభివృద్ధి చేసే విషయంపైన కూడా అగ్రిమెంటు కుదిరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.