భారతీయ జనతా పార్టీ నేత హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురికావడం సంచలనం సృష్టించింది. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ జరిగింది. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి జనగామ బీజేపీ టిక్కెట్ రేసులో ఉన్నాడు. ఆయన బీజేపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటేనే మరొక వైపు రాజకీయం తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఆయన తన కుటుంబంతో కలసి కుషాయిగూడలో స్థిరపడ్డారు. అక్కడే నివాసం ఉంటున్నారు.
భూవివాదాలేనా?
తిరుపతి రెడ్డిని నిన్న మద్యాహ్నం ఆల్వాల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద కిడ్నాప్ చేసినట్లు ఆయన భార్య సుజాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఆమె పోలీసులకు తెలిపారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రెడ్డిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.