చంద్రయాన్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న ఇండియా కోరిక నెరవేరనుంది. ఎల్ వీఎం 3 ఉపగ్రహ వాహన నౌక ద్వారా చంద్రయాన్ 3 ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ ర్యాకెట్ వచ్చే నెల 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
వచ్చే నెల 23…
3,920 కిలోల బరువున్న చంద్రయాన్ 3 అనుకున్న ప్రకారం సేఫ్ ల్యాండింగ్ అయితే భారత్ అగ్రదేశాల సరసన చేరనుంది. గత కొన్ని నెలలుగా ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ ఫలించినట్లవుతుంది. చంద్రయాన్ 3 ఉపగ్రహ నౌక ద్వారా విడిపోయిన వెంటనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న శాస్త్రవేత్తలు అభినందనలను తెలుపుకున్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా భూక్ష్యలోకి ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకున్నారు.