యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీ వీధులన్నీ జలమయమయ్యాయి. గత యాభై ఏళ్లలో ఢిల్లీ నగరం ఇలాంటి ముప్పును ఎన్నడూ ఎదుర్కొనలేదని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు కూడా వరద నీరు చేరింది. సుప్రీంకోర్టుకు సయితం చేరింది. రహదారులన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది ఉధృతి ఈరోజు కాస్త తగ్గుముఖంపట్టినప్పటికీ వరద నీరు నగర వీధుల్లోనే ఉంది. వరద నీరు తిలక్ మార్గ్ లోని సుప్రీంకోర్టు పరిసరాలకు చేరింది.
వరదలతో అతలాకుతలం…
ఢిల్లీలో వరదతో అనేక నీళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రహదారులపైకి రావడం గగనంగా మారింది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. వరద తాకిడికి మురుగు వాసన కొడుతోంది. దుర్గంధం భరించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడేలేదని ఢిల్లీ వాసులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైన్యం సాయాన్ని కోరారు. పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.