బంగారం, వెండి ఒకప్పుడు గౌరవప్రదమైన వస్తువులు. నేడు అవి స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం ఎంత ఉంటే సమాజంలో అంత గౌరవం దక్కుతుందన్న నమ్మకంతో ఎక్కువగా దాని కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కొందరు పెట్టుబడిగా చూస్తుండగా, మరికొందరు మాత్రం తమ ఇళ్లల్లో వివాహాలు, శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అయినా ధరలను చూసి వెనకడుగు వేయడం లేదు.
భద్రత కోసం…
మహిళలు ఇష్టపడే బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తులం బంగారం అరవై వేలకు చేరుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసి తమ వద్ద ఉంటే భద్రతగా భావించడం పెరిగి పోవడంతో దానికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. భారత ప్రభుత్వం బంగారం దిగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా బంగారం డిమాండ్ కు తగిన రీతిలో దేశంలోకి చేరడం లేదు.
ఈరోజు ధరలు…
ప్రస్తుతం బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది సంతోషకరమైన విషయమే. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గడం, స్థిరంగా కొనసాగుతుండటం కొనుగోలు దారులకు ఊరటకల్గించే విషయమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55 రూపాయలుండగా, 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేలు పలుకుతుంది. వెండి మాత్రం భారీగా పెరిగింది. ఈరోజు కిలో వెండి ధరపై పదిహేను వందలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 77,100 రూపాయలకు చేరుకుంది.