తెలుగు దేశం పార్టీ యువనేత మరియు మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేస్తున్న యువగలం పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియా సమావేశం లో అయన మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ స్కాం మరియు అమరావతి ఇన్సైడర్ ల్యాండ్ పూలింగ్ స్కాం లో తన పేరుని వైస్సార్సీపీ తీసుకురావడాన్ని ఆయన ఖండించారు.
ఫైబర్ గ్రిడ్ స్కాం..!
గత టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన ఫైబర్ గ్రిడ్ స్కాం పై జరుగుతున్న సి ఐ డి విచారణలో తన పేరు ప్రస్తావించడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు పొందిన సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ సంబంధం ఉందని ఆరోపిస్తే దానికి సాక్ష్యాలు చూపాలని ఆయన డిమాండ్ చేసారు.
ఆ రెండు ఎకరాలు మాత్రమే..!
అలాగే అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కాం లో లోకేష్ భారీగా భూములు వెనకేసుకున్నాడని వస్తున్న ఆరోపణలపైనా లోకేష్ సమాధానమిచ్చారు. తనకు కానీ తన కుటుంబానికి కానీ కుప్పం లోని రెండు ఎకరాల భూమి తప్పితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరెక్కడా సెంటు భూమి కూడా లేదని, కుప్పం లో కొన్న రెండు ఎకరాల ఆ భూమి కూడా సొంత ఇంటి నిర్మాణం కోసం కొన్నామని తెలిపారు.
కుప్పంలో కొన్నా 2 ఎకరాలు తప్ప ఏపీలో మాకు సెంటు భూమి లేదు
నేను అస్సాం జంప్… పప్పు కామెడీ చూడలేక🤪 pic.twitter.com/bnE71Gmki3
— जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) July 14, 2023