ఫ్రాస్స్ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అబుదాబిలో పర్యటిస్తున్నారు. ఆయన యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్వాన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల భాగస్వామ్యంపై చర్చించినట్లు చెబుతున్నారు. మోదీ ప్రధాని బాధ్యతలను చేపట్టిన తర్వాత ఐదోసారి యూఏఈలో పర్యటిస్తుున్నారు. వివిధ ద్వైపాక్షిక అంశాలపై యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని చర్చించే అవకాశముంది.
పలు అంశాలపై…
అబుదాబి ప్రిన్స్ షేక్ మహ్మద్ జాయేద్ ను కూడా ప్రధాని మోదీ కలిశారు. యూఏఈ పర్యటనలో ఇంధనం, ఆహార భద్రత, రక్షణ రంగాలపై చర్చ జరగనుందని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్ నుంచి నేరుగా అబుదాబికి చేరుకున్న ప్రధానికి అక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.