అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అందుకే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కొవ్వూరు పట్టణంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తానేటి వనిత పాల్గొన్నారు. వివిధ సమస్యల కోసం, పథకాల కోసం కార్యాలయాల చుట్లూ తిరిగే అవసరం లేకుండా సురక్ష కార్యక్రమం ద్వారా అంద చేయడం జరుగుతుందన్నారు.
సమస్యలు వెంటనే…
ఈరోజు 1,261 మంది లబ్దిదారులకు వారి సమస్యలకు సంబంధించిన పత్రాలను తానేటి వనిత అందచేశారు. కేవలం పథకాలు మాత్రమే కాకుండా రేషన్ కార్డు నుంచి అన్ని సమస్యలను సత్వరం పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేశారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలకు కూడా దీర్ఘకాలంగా ఎదురు చూడకుండా సత్వరమే పనులు పూర్తయ్యేందుకు సురక్ష కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు.