భారత్ లో రైల్వే అభివృద్ధి కి కృషి చేస్తున్న మోడీ సర్కార్ సరి కొత్తగా వందే సాధారన్ పేరుతో కొత్త నాన్ ఏసీ రైళ్లను ఈ డిసెంబర్ నాటికి పట్టాలెక్కించనుంది. వందే భారత్ రైళ్లు ఏసీ కోచ్ లతో నడుస్తూ ఉంటె తాజా వందే సాధారన్ రైళ్లు నాన్ ఏసీ కోచ్ లతో నడవనున్నాయి. సామాన్య ప్రజలకు సేవలందించే లక్ష్యంతో, భారతీయ రైల్వే సుదూర ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం స్లీపర్ మరియు జనరల్ సదుపాయంతో నాన్-ఏసీ వందే సాధారన్ రైలును తయారు చేయనుంది.
నాన్ ఏసీ వందే సాధరన్..!
నాన్-ఎసి వందే సాధరణ రైలును చెన్నై లోని ICF (Integrated Coach Factory) లో రూ. 65 కోట్ల అంచనా వ్యయంతో తయారు చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి రేక్ను విడుదల చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. చెన్నైలోని ICF ఫ్యాక్టరీలో ప్రస్తుతం 100 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిగా సీటింగ్ పద్దతిలో నడిచే AC వందే భారత్ రైలును తయారు చేస్తున్నారు.
నాన్ ఏసీ రైళ్లలో తొలిసారిగా..
వందే సధారన్లో 24 ఎల్హెచ్బి కోచ్లు మరియు రైలును వేగంగా నడవడానికి ముందు మరియు వెనుక భాగంలో రెండు లోకోమోటివ్లు ఉండగా ప్రతి కోచ్లలో బయో వాక్యూమ్ టాయిలెట్లు, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ మరియు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్లో మాదిరిగానే వన్డే సాధరన్ రైలులో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉండగా నాన్-ఏసీ రైలులో సీసీటీవీ కెమెరా, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని రైల్వే శాఖ ప్రకటించింది.
సామాన్యులకు అందుబాటు ధరలలో..
వందే సాధరన్ రైలులో టికెట్ ధరలు వన్డే భారత్ లోలా అధికంగా కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై లోని ICF ఫ్యాక్టరీలో వందే భారత్ , వందే సాధారన్ రైళ్ళే కాకుండా దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ప్రయాణం కోసం వందే మెట్రో పేరుతో మెట్రో రైళ్ల కోచ్ లను కూడా తయారు చేస్తోంది.