భారతీయ రైళ్లలో ఇటీవల అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లు అనేక కారణాలతో దగ్దమయిపోతున్నాయి. తాజాగా వందేభారత్ రైలులోనూ మంటలను వ్యాపించడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. భూపాల్ నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్ రైలులో మంటలు వ్యాపించాయి. బ్యాటరీ బాక్సులో మంటలు చూసి ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
సురక్షితం…
వెంటనే వందేభారత్ రైలు నుంచి కిందకు దిగిపోయారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలు బ్యాటరీ నుంచి మాత్రమే మంటలు వచ్చాయని, ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్యాటరీ బాక్స్ లో మంటలు రావడానికి కారణంపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.