జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి చేరుకున్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జనసైనికులు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. ఇటీవల జనసేన ఆందోళనలు చేసిన సందర్భంగా జనసేన కార్యకర్త సాయిపై శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్ పెక్టర్ అంజుయాదవ్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీఐ అంజూ యాదవ్ పై…
జనసైనికులను టచ్ చేస్తే ఊరుకునేది లేదని, తాను వారికి అండగా నిలబడతానని పవన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శ్రీకాళహస్తి సీఐపై ఫిర్యాదు చేయడానికి తిరుపతికి వచ్చారు.. అంజూయాదవ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మాత్రమే కాకుండా గతంలో అంజూయాదవ్ పై వచ్చిన అనేక ఆరోపణలను పవన్ కల్యాణ్ ఎస్పీకి వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ ఎస్పీ కార్యాలయం ఎదుటే మీడియా సమావేశం పెట్టే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.