బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
పిడుగులు పడే…
ఈరోజు ఏపీలోని పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్లాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, తెలంగాణలో మాత్రం ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలపింది.