హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పిన లారీని రెండు వాహనాలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ వెళుతున్న లారీ అదుపుతప్పింది.
వెనక నుంచి వచ్చి…
అయితే వెనక నుంచి వచ్చిన కారు, బొలెరో వాహనం లారీని ఢీకొట్టాయి. బోలెరో వాహనంలో ఉన్న ఇద్దరితో పాటు లారీలో ఉన్న ఒకరు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ అదుపుతప్పడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.