టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (Yasaswi jaiswal) తన రాకను గ్రాండ్గా చేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జైశ్వాల్.. తొలి మ్యాచ్లోనే అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 171 పరుగులు చేశాడు. అరంగేట్రం మ్యాచ్లో సెంచరీ చేసిన జైశ్వాల్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్కు ఎక్కువ కాలం ఆడే అద్భుతమైన ఆటగాడు జైస్వాల్ అని హర్భజన్ కొనియాడాడు.
‘తొలి మ్యాచ్లోనే యసస్వి జైస్వాల్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతను డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడని చాలా బాధపడ్డాను. అయితే జైశ్వాల్ మాత్రం భారత క్రికెట్ను ఎక్కువ కాలం శాసించటం ఖాయం. జైశ్వాల్కు ప్రతిభకు లోటు లేదు. అతనికి నా సలహా ఒక్కటే. ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు జైశ్వాల్ మరింత కష్టపడాలి. అదే విధంగా, మీరు మీ ఫిట్నెస్ను కాపాడుకోవాలి. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత అతని బ్యాట్ నుంచి ఇది సెంచరీ. కోహ్లీ కూడా సెంచరీ మార్కును చేరుకుని ఉంటే బాగుండేది’ అని హర్భజన్ (harbajan sigh) తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.