ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జగనన్న తోడు నిధులను లబ్దిదారుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు. చిరు వ్యాపారులు చేసుకునే వారికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేయనున్నారు. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన వారికి కూడా ఈ దఫా నిధులను విడుదల చేయనున్నారు. చిరు వ్యాపారాలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రభుత్వమే వడ్డీని వారి ఖాతాల్లో జమ చేస్తుంది. తీసుకున్న అసలు మొత్తాన్ని చెల్లిస్తే చాలు.
చిరు వ్యాపారులకు…
ఈరోజు జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ఏడో విడతగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 5,10,412 లక్షల మంది లబ్దిదారులకు 549 కోట్ల రుణాలను నేడు జగన్ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి 11.03 కోట్ల వడ్డీ డబ్బులను కూడా నేడు జమ చేయున్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది చిరు వ్యాపారులు ఏపీలో లబ్ది పొందనున్నారు. తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేయడానికి ఈ నిధులను వినయోగించుకునే వీలుంటుందని ప్రభుత్వం జగనన్నతోడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈరోజు ఏడోవిడతగా నిధులను విడుదల చేయనున్నారు.