జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. అధికారులు ఈ మేరకు ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో తీవ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలపిారు. నిన్న రాత్రి సూరంకోట్ బెల్ట్ లోని సింధారా టామప్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి భద్రతాదళాలతో కలసి జమ్ము కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
జమ్మూకాశ్మీర్ లో….
ఈరోజు తెల్లవారు జామున ఉగ్రవాదులు కాల్పులను ప్రారంభించారు. దీంతో భద్రతాదళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారా అన్న అనుమానంతో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలియచేయనున్నట్లు జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేష్ సింగ్ తెలిపారు.