మంచి పనులతో కొందరు చరిత్రలో చిరస్తాయిగా నిల్చిపోతారు. జనం గుండెల్లో పదికాలాల పాటు ఉంటారు. కానీ కొందరు అలాకాదు, తమ వికృత చేష్టలతో జనాన్ని వణికిస్తారు. వారి పేరు వింటేనే జనం ఛీ కొట్టే పరిస్తితి తెచ్చుకుంటారు. అందులోనూ వారు ఆడవాళ్లైతే… ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రపచంలో ఇలాంటి కోవకు చెందిన వారి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.
బుస్సీ పేరు వింటేనే….
బ్రిటీష్ పాలనకాలంలో బుస్సీ దొర పేరు వింటేనే గోదావరి ఏజెన్సీలోని పిల్లా, పెద్దా ఉలిక్కిపడేవారట. అందుకే తమ పిల్లలు చెప్పిన మాట వినకపోతే బుస్సి పేరు మార్చి బూచి బూచి అంటూ భయపెట్టేవారట. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ, జనంలో మాత్రం బుస్సీ పేరు ఆ రకంగా నిల్చిపోయింది. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ విషయానికొస్తే… ప్రపంచ చరిత్రలో చాలా మంది పేరు మోసిన రాణుల్లో కొందరు శాడిస్టులు ఉన్నారు. వాళ్లు అలాంటి ఇలాంటి శాడిస్టులు కారు. వారి శాడిజానికి తన, మన తేడా లేకుండా చాలా మంది బలయ్యారు. అందుకే ఇప్పటికీ వారి పేర్లు ప్రపంచం గుర్తుపెట్టుకుంటోంది.
బ్రాండెన్ బర్డ్ రాణి మారియా…
స్వీడన్ రాజవంశానికి చెందిన బ్రాండెన్ బర్డ్ రాణి మారియా ఎలెనోరా. జర్మనీ నుంచి వలస వెళ్లిన మారియా కుటుంబం బ్రాండెన్ బర్గ్ ప్రాంతంలో సెటిలైంది. ఆ తర్వాత కింగ్ రెండవ గుత్సవ్ తో వివాహమైన తర్వాత 1620 నుంచీ 1632 దాకా స్వీడన్ రాణిగా పెత్తనం చలాయించింది. వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ పిల్ల చూడటానాకి భయంకరంగా ఉండటంతో మారియాలో శాడిస్ట్ కోణం బయటకు వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా ఆ పాపకు నరకం చూపించింది. కన్నకూతురుని రక్తపిశాచిగా భావించిన మారియా, భర్త యుద్ధంలో చనిపోయిన తర్వాత తన కూతురును ఆయన శవపేటికలో నిద్ర పోవాలని ఆదేశించింది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు మారియా ఆగడాలు సాగాయి. అయితే తన 40వ ఏట రాజ్యంలోని ఓ ధనవంతుడితో పారిపోయింది మారియా.
జెతేన్ రాణిది మరో కథ
ఇక చైనాకు చెందిన ఊ జెతేన్ రాణికి మరో కథ. చైనాను పాలించిన మొదటి రాణిగా పేరు తెచ్చుకున్న ఆమె, కుయుక్తులు, పొత్తులతో అధికారం దక్కించుకుంది. క్రీస్తుశకం 690 నుంచి 705 దాకా ఊ జోయ్ వంశ పాలన సాగింది. ఆ సమయంలోనే చక్రవర్తి గాజోంగ్ ను వలలో వేసుకున్న జెతేన్, ఆయన చనిపోయిన తర్వాత రాణికి నరకం చూపించింది. రాణి కుమారులైన లీ హంగ్, లీ జియాన్ లను తన వైపు తిప్పుకున్న జెతేన్, వారి తల్లిని దారుణంగా చంపేసింది. బతికుండగానే రాణి కాళ్లు, చేతుల నరాలు కోసి వైన్ నింపిఉన్న తొట్టెలో ముంచి చంపేసింది. ఆ తర్వాత రాణి పెద్దకొడుకును పెళ్లి చేసుకుని లీ వంశం పేరుతో రాజ్యం స్థాపించింది.
దేశం విడిచి వెళ్లాలంటూ…
ఇక స్పెయిన్ దేశానికి చెందిన రాణి ఇసాబెల్లా. 1451 నుంచి 1504 దాకా స్పెయిన్ పాలించిన రెండవ ఫెడ్రినాడ్ టూ రెండవ భార్య ఇసాబెల్లా. స్వతహాగా కేథలిక్ అయిన ఇసాబెల్లా, తన రాజ్యం పదిలంగా ఉండాలని భావించింది. అందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం నరమేధం. తన రాజ్యంలోని ముస్లింలు, యూదులు వెంటనే కాథలిక్స్ అవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టం లేని వారు దేశం విడిచి పోవాలని వార్నింగ్ ఇచ్చింది. దాదాపుగా రెండు వేల మందిని దారుణంగా చంపించింది ఇసాబెల్లా.
సీరియల్ కిల్లర్….
ఇక హంగేరి దేశానికి చెందిన బెథోని వంశ రాణి ఎలిబెత్ బేథోనీ. సీరియల్ కిల్లర్ పేరు తెచ్చుకున్న ఆమె క్రూరత్వానికి అంతేలేదు. అధికారం, ఆస్తుల కాపాడుకోడానికి పలువురిని చంపించిన ఆమెకు, తన అందంపై కూడా మోజు ఎక్కువ. జీవితాంతం యవ్వనంగా కనిపించాలన్న కోరికతో కన్నెపిల్లలను చంపించింది. ఎందుకంటే, కన్నెపిల్లల నెత్తుటితో స్నానం చేస్తే వృద్ధాప్యం రాకుండా నిత్య యవ్వనం ఉంటానని భావించిన బెథోనీ, దాదాపు 600 మంది కన్నెపిల్లలను చంపి, వారి నెత్తుటితో స్నానం చేసింది. ఇదంతా తన రాజ మందిరంలోనే జరిపించింది. ఇందుకోసం దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల ఆడపిల్లలనే టార్గెట్ చేసేది. అయితే కొందరు చరిత్రకారులు, బెథోనీ మంత్రగత్తెనీ, ఆమె కన్నెపిల్లల నెత్తురు తాగుతుందని వాదిస్తున్నారు.
కొడుకును సయితం…
ఇక బైజెంటేన్ రాజవంశానికి చెందిన ఏథెన్స్ రాణి ఐరేన్. క్రీస్తుశకం 797 నుంచి 802 దాకా పాలించిన ఆమె, రాజ్యం కోసం తన కన్న కొడుక్కి ఇరవై ఏళ్ల పాటు నరకం చూపించింది. కొందరు సామంతులు, దాయాదులతో కుట్ర చేసి రాజ్యం దక్కించుకునే ప్రయత్నం చేసి విఫలమైన ఐరేన్, తర్వాత కొడుకుతో రాజీ కుదుర్చుకుంది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె, కొడుకు పాలనపై జనంలో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గమనించి అదును చూసి అతన్ని దించేసింది. ఆ తర్వాత కొడుకును అరెస్ట్ చేయించి కళ్లు పీకించింది.
కుటుంబ సభ్యులనే కడతేర్చి…
ఇక మడగాస్కర్ రాణి రణవలోవ. 1828 నుంచి 1861 దాకా పాలించిన ఆమె, రాజ్యం కోసం ఎంతకైనా తెగించేదట. భర్త మొదటి రడమ చనిపోయిన తర్వాత రాజ్యం చేపట్టింది. తన అధికారానికి అడ్డు వస్తారని భావించిన ఆమె, భర్త తండ్రినీ, చెల్లినీ ఉరితీయించింది. అలాగే భర్త తరపు దాయాదులను కూడా వదల్లేదు. చిన్నా పెద్దా, ఆడ మగా తేడా లేకుండా అందరినీ వరుసబెట్టి ఉరితీయించింది.
ఈ రాణి శాడిజం…
ఇక ఫ్రాన్స్ దేశానికి చెందిన కాథరీన్ డీ మెడికి. ఈమెది ఓ రకమైన శాడిజం. అప్పటి రాజు రెండవ హెన్నీకి తన మంత్రివర్గంలోని డైనే డీ పోయిటర్స్ అనే ఆమెతో సంబంధం ఉండేది. అది రాణి కాథరీన్ కి ఏమాత్రం నచ్చలేదు. తనను సుఖపెట్టని రాజుపై కోపం పెంచుకున్న మెడికి, అదును చూసి భర్తకు విషం పెట్టించి మంచాన పడేసింది. అప్పటి నుంచీ ఒక్క మనిషిని కూడా అతని గదిలోకి పంపలేదు. తల్లి మాట కాదని తండ్రి గదిలోకి వెళ్లిన సొంత కుమార్తెను ఖైదీ చేయించింది. తన కుమార్తె వివాహాన్ని ఒప్పుకోని ఆమె, మరీ శాడిజంగా ప్రవర్తించింది. కుమార్తె, అల్లుడిని కట్టేసి వారి ముందే తనకు నచ్చిన వారితో సెక్స్ చేసేది. కొన్నాళ్ల తర్వాత కుమార్తె ముందే ఆమె భర్తను ఉరితీయించింది.
నరకం చూపించి…
ఇక బ్రిటన్ మహారాణి బ్లడ్డీ మేరీ. కేథలిక్ క్రిస్టయన్ అయిన మేరీ, తన ఐదేళ్ల పాలనతో కొన్ని వర్గాలకు నరకం చూపించింది. తన రాజ్యంలోని ప్రొటెస్టెంట్స్ అందరూ కేథలిక్స్ కావాలని ఆదేశించింది. ఎదురు తిరిగిన దాదాపు 500 మందిని సజీవ దహనం చేయించింది. ఇక లైబీరియాకు చెందిన జువానా లా లోకా. ఈ మహారాణి ఓ మానసికమైన వ్యాధితో బాధ పడేదట. 1506లో తన భర్త మరణం తర్వాత రాజ్యం అధిష్టించిన ఆమె, 1516 దాకా లైబీరియాను పాలించింది. అయితే పూడ్చి పెట్టిన తన భర్త శవాన్ని వెలికి తీయించిన జువానా, ఆ శవపేటిక పక్కనే నిద్రపోయేదట. రోజూ శవానికి ముద్దులు పెట్టేదట. తాను ఎక్కడికి వెళ్లినా భర్త శవపేటికను తీసుకెళ్లేదట. కొన్నాళ్ల తన భర్త శవాన్ని తన బెడ్ రూం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో, తన కిటికీ నుంచి కనిపించేలా పాతిపెట్టించింది.
భర్తను నరికి…
ఇక రష్యాకు చెందిన క్వీన్ కేథరీన్. మధ్యతరగతి స్పానిష్ కుటుంబంలో పుట్టిన ఆమె, రాజ కుటుంబానికి చెందిన పీటర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. 1762లో తన తల్లి చనిపోవడంతో రాజ్యం ఎక్కిన పీటర్ మీద జనానికి నమ్మకం లేకుండా పోయింది. దీంతో అధికారం పోతుందన్న భయంతో భర్తను చంపించింది కేథరీన్. ఆ తర్వాత మహారాణిగా కిరీటం ధరించింది. అడ్డువస్తారని భావించిన రాజ కుటుంబీలను దాదాపుగా ఉరితీయించింది.