ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రముఖ పారిశ్రామిక సంస్థ రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా భేటీ అయ్యారు. విశాఖలో ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణం పై చర్చించారు. విశాఖపట్నంలో ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణం చేపట్టేందుకు రహేజా అంగీకరించారు. దీని ద్వారా ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణం రూపుదిద్దుకోనుందని చెప్పారు.
జగన్ తో రహేజా భేటీ…
మూడేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. అలాగే ఇన్ ఆర్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ను రహేజా గ్రూపు సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యలక్రమంలో నీల్ రహేజాతో పాటు ఇన్ ఆర్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, తెలంగాణ, ఆంధ్ర చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణకుమార్ తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ కూడా హాజరయ్యారు.