తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
భారీ వర్షాలు…
ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్ తో పాటు పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచే వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి.