జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. నిన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నపవన్ కల్యాణ్ ఈరోజు కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. రాజకీయ అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో…
ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగనున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీని ఎలా ఎదుర్కొనాలన్న దానిపై ఇరువురు చర్చించినట్లు చెబుతున్నారు. అంతే తప్ప టీడీపీని కలుపుకుని వెళ్లాలా? వద్దా అన్న దానిపై మాత్రం చర్చ జరగలేదని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.