ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. డ్యామ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ పేలి పదిహను మంది వరకూ మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. అనేక మంది గాయాలపాలయ్యారు. అలకనంద నదిపై ఉన్న చమోలీ డ్యామ్ వద్ద ట్రాన్ ఫార్మర్ పేలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ట్రాన్స్ ఫార్మర్ పేలి…
అలకానంద నదిపై ఉన్న వంతెనకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా తెలిసింది. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అలకానంద నదిపై ఉన్న వంతెన రెయిలింగ్ కు విద్యుత్తు తాకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేష్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.