కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై ఎలా వెళ్లాలన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. దాదాపు మూడు గంటలకు పైగానే ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో క్యాడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.
కోమటిరెడ్డి ఇంట్లో భేటీ…
నేతలందరూ కలసి ఐక్యంగా బస్సు యాత్ర చేయాలని ప్రాధమికంగా నేతలు నిర్ణయించారు. అప్పుడు ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే బస్సు యాత్రకు హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాలని పలువురు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్ నగర్ లో జరగనున్న ప్రియాంక సభపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.