జమ్మూ కాశ్మీర్ లో వరదలు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వరదల ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కధువా జిల్లాలో భారీ వర్షాలకు వరదలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తీసుకున్న చర్యలు ఫలించలేదు. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ఎనిమిది మంది మరణించారు.
కొండచరియలు విరిగిపడి…
ఇళ్లు కూడా వరదల ధాటికి కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రయివేటు పాఠశాలలను కూడా మూసివేశారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు గుర్తించి సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నలభై నాలుగో నెంబరు జాతీయ రహదారిపైకి కూడా వరద ధాటికి బురద, రాళ్లు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.