పసిడి అంతే. పెరిగితే భారీగా, తగ్గితే అతి తక్కువగా ధరలు పెరుగుతాయి. కొనుగోలుదారులు ఎక్కువవ్వడమే కాకుండా, డిమాండ్ కు తగిన రీతిలో బంగారం లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయన్నది ఒక కారణం. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయితే ఇక పసిడి ధరలను పట్టుకోలేం అంటున్నారు వ్యాపారులు. అందుకే ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునే వారు ఇటీవల కాలంలో అధికమయ్యారు. అందుకే బంగారం కొనుగోళ్లు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
పెట్టుబడిగా…
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో పాటు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు పెట్టడం కూడా ధరలు పెరుగుదలకు ఒక కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటం, పెట్టుబడిగా ఎక్కువ మంది కొనుగోళ్లు జరుపుతుండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఎంత పెరిగిందంటే?
వరసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,750 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 78,400 రూపాయలుగా కొనసాగుతుంది.