మణిపూర్ లో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5 గా నమోదయినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. మణిపూర్ లోని ఉక్రుల్ పట్టణంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సంభవించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జైపూర్ లోనూ…
రాజస్థా,న్ లోని జైపూర్ లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. జైపూర్ లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. అయితే నిద్రలో ఉన్న ప్రజలు ఇదేదీ గమనించలేదు. అయితే ఈ భూకంప తీవ్రత కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడంచారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.