ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లా వెంకటగిరి బయలుదేరి వెళ్లారు. వెంకటగిరిలో నేడు నేతన్న నేస్తం పధకం నిధులను విడుదల చేయనున్నారు. వరసగా ఐదో ఏడాది ఈ నిధులను జగన్ విడుదల చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు 192 కోట్ల రూపాయల నిధులను వెంకటగిరి సభ నుంచి విడుదల చేయనున్నారు. వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు.
అర్హులైన నేతన్నలకు….
అర్హత ఉన్న నేత కార్మికులకు ప్రతి ఏటా 24,000 రూపాయలను ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా నిదులను ఇస్తుంది. ఇప్పటి వరకూ 967 కో్ట్ల రూపాయల నిధులను ఈ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు నేతన్నలకు పెన్షన్ కింద 1.396 కోట్లు ఇచ్చింది. ఆప్కో కు 468 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,20,000 అందుకున్నారు.