కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ పేరుతో ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారంటూ సూరత్ కోర్టు ఆయన పార్లమెంటు పదవి పై అనర్హత వేటు వేసింది. ఒకరిద్దరు బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోతే మొత్తం మోదీలనే అవమానిస్తూ ఆయన కర్ణాటకలో చేసిన ప్రసంగంపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పార్లమెంటు పదవిపై అనర్హత వేటు వేసింది.
హైకోర్టులోనూ…
దీనిపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. అక్కడ కూడా రాహుల్ పదవిపై అనర్హత వేటు సబబేనని, సూరత్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికాసేపట్లో దీనిపై తీర్పు రానుంది. ఈ తీర్పు రాహుల్ కు అనుకూలంగా వస్తే ప్రస్తుతం జరగనున్న వర్షాకాల సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. లేకుంటే ఇక వచ్చే ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.