హైదరాబాద్ ను వర్షం వీడటం లేదు. గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంలో ఎక్కడ చూసినా నీరునిలిచిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రయివేటు సంస్థలు కూడా మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక శాఖను ఆదేశించారు.
ఈరోజు కూడా…
అయితే ప్రయివేటు సంస్థలు మూసివేయకపోవడంతో శుక్రవారం కూడా అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నగరంలో ఎక్కడ కాలుమోపినా నరకంగానే కనిపిస్తుంది. ప్రధానంగా పీక్ అవర్స్ అంటే కార్యాలయాలు వదిలిపెట్టే సమయానికి ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగాఉంది. అందుకే విడతల వారీగా రోడ్లపైకి రావాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.