అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కోస్తాంధ్ర – ఒడిశాను అనుకుని అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించారు.
అల్పపీడన ప్రభావంతో…
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటుగా ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.