ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా?అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం వృధా కాదా? అని ప్రశ్నించింది.
ఆర్ 5 జోన్ లో…
దీనిపై ఇంకా వాదనలను కొనసాగనున్నాయి. ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఇళ్ల నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టులో సమస్య పెండింగ్ లో ఉండగా ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని హైకోర్టును రైతులు ఆశ్రయించడంతో దీనిపై విచారణ జరిగింది. లబ్దిదారులకు పట్టాలు అందచేయడంతో వీలయినంత త్వరగా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.