ఈరోజు ప్రధాని నరేందర మోదీ డెబ్భయివేల మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగే ఈ నియామకాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందచేశారు. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరిల కింద ఎంపికయిన వారికి అపాయింట్ మెంట్ లెటర్లు ప్రధాని అందించి, వారితో ముచ్చటించనున్నారు.
ప్రధాని చేతులు మీదుగా…
భారత్ లో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. యువత ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ విధులను నిర్వర్తించాలని కోరారు. ఈరోజు ప్రధాని అందచేసిన నియామకపు ఉత్తర్వుల్లో రెవెన్యూ, ఫైనాన్స్, పోస్ట్, ఉన్నత విద్యాశాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో పాటు రాష్ట్రానికి సంబంధించి జలవనరుల శాఖలో కూడా 70 వేల పోస్టులు భర్తీచేశారు.