కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు దేశంలోనే అత్యంత ధనవంతులుగా ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ధనవంతులైన ముగ్గురు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇటీవల కర్ణాటక ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వారి అఫడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ముగ్గురూ…
కర్ణాటక మంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. 1,413 కోట్ల రూపాయల ఆస్తుల విలువను ఆయన కలిగి ఉన్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిాచరు. రెండో స్థానంలో కర్ణాటకకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 1,267 కోట్లు. అలాగే మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియా కృష్ణ ఆస్తుల విలువ 1,156 కోట్లు అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.