తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామాజిక సమస్యలపై ముందుంటారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తారు. ఎలాంటి ఘటనలపైన అయినా ఆమె నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా మణిపూర్ ఘటనపై తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు. మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించడంపై ఆమె స్పందించారు.
అమానవీయ…
చరిత్రలో ఎలాంటి ఘర్షణలు జరిగినా మహిళలు నిన్సహాయ స్థితిలో నిలుస్తారని స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. మణిపూర్ లో జరిగిన ఘటన అమానవీయమని ఆమె అన్నారు. నిస్సహాయులైన అమాయకపు మహిళలను ఊరేగించి యాభై వేల ముందు నిలబెట్టడం అమానుషమని ఆమె అన్నారు. ఈ ఘటన మన మూలాలను కదిలిస్తోందని, ఇంత జరుగుతున్నా మీడియా ఏం చే్స్తుందని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. మణిపూర్ ను అలా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు.