సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఒక్కోసారి అనుకోని అదృష్ణం కలసి వస్తుంది. ఖరీదైన చేపలు దొరుకుతుంటాయి. ఒక్క చేప దొరికినా చాలు మత్స్యకారుడికి పండగే. నెల రోజులు పడే కష్టం ఒకే చేపద్వారా లభ్యమవుతుంది. కాకినాడలో అదే జరిగింది. కాకినాడ సముద్రంలో కుంభాభిషేకం రేవు వద్ద ఈ అరుదైన చేప మత్స్యకారుడి వలలో పడింది. ఈ చేప మూడు లక్షల పది వేల రూపాయల ధర పలికింది.
ఔషధ గుణాలు…
చేపను దక్కించుకోవడం కోసం వేలం నిర్వహించారు. వేలం నిర్వహించిన మధ్యవర్తికి ఇరవై ఐదు వేల రూపాయలు లభించాయి. ఈ చేపను కచ్చిడి చేపగా పిలుస్తారు. ఈ చేపలోపల ఉండే బ్లాడర్ కు గొప్ప ఔషధగుణాలుంటాయి. అందుకే చేపలోని బ్లాడర్ కు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ఇరవై ఐదు కేజీల ఉన్న ఈ చేపను అంత ధరను పెట్టి కొనుగోలు చేస్తారు. ఔషధాల తయారీలో ఈ కచ్చిడి చేపను వినియోగిస్తారు. అనేక వ్యాధుల మందుల తయారీకి దీని బ్లాడర్ ఉపయోగిస్తారు. అందుకే అంత ధర పలికిందని మత్స్యకారులు చెబుతుననారు.