RSS: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్టు పై జనసేన అధినేత పవన్ చేసిన ఆరోపణలు తెలిసిందే. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్క దారి పడుతున్నాయని చంద్రబాబు, పవన్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రతిపక్షల ఆరోపణలు ఎలా ఉన్నా.. శ్రీవాణి ట్రస్ట్ పై తాజాగా RSS Chief మోహన్ భాగవత్ (Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేసారు.
శ్రీ వాణి సేవలు భేష్..!
ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి RSS Chief (Rashtriya Swayamsevak Sangh) మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 30 దేశాల నుంచి దాదాపుగా 1,600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీవాణి ట్రస్ట్ హిందూ ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ఉందని అభినందించారు. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో కూడా ఆలయాల నిర్మాణాలను చేపట్టడం గొప్ప విషయమని ఆయన కితాబిచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన తరగతుల ప్రజల కాలనీలలో శ్రీ వారి ఆలయాలు నిర్మించి ధర్మ పరిరక్షణకు టీటీడీ చేస్తున్న కార్యక్రమాలని ఆయన అభినందించారు.
పవన్ ఆరోపణలు డొల్లే
అయితే, శ్రీ వాణి ట్రస్ట్ పై పవన్ , చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా సాక్షాత్తు RSS Chief మోహన్ భాగవత్ ఏ శ్రీ వాణి ట్రస్ట్ ను అభినందిస్తూ వ్యాఖ్యానించడంతో శ్రీ వాణి ట్రస్ట్ లో ఎదో జరిగిపోతూ ఉందని పవన్, చంద్రబాబు చేసిన ఆరోపణలు డొల్ల అని తేలిపోయాయి.
రూ. 176కోట్లతో జమ్మూ ,కన్యాకుమారి. భువనేశ్వర్,విశాఖపట్నం.సీతంపేట,రంపచోడవరం,అమరావతి,చెన్నై లో అద్భుతమైన ఆలయాల నిర్మించిన టిటిడి ట్రస్ట్ ద్వారా 120కోట్లు వ్యయంతో
ఏపి,తెలంగాణ,తమిళనాడు ,పాండిచ్చేరి రాష్ర్టాలలో 127పూరాతన ఆలయాల పున:నిర్మాణం#TTDTemples #YVSubbaReddy #SRIVANITrust #TTD pic.twitter.com/hAn3r3uOed— చెల్లుబోయిన నరేన్ యవసేన (@yapasena56681) July 6, 2023