రైళ్లలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో రైలును ఒక వంతెన పైన నిలిపేశారు. వంతెనపై నుంచి ప్రయాణికులు భయంతో కిందకు దూకారు. ఈ ఘటన హరిద్వార్ జిల్లాలో జరిగింది. ఆదివారం హరిద్వార్ నుంచి లక్నో వెళుతున్న రైలులో మంటలు సంభవించాయి. దీంతో ప్రయాణికులు చైన్ లాగి నిలిపేశారు. అయితే రైలు ఒక వంతెన మీద ఆగిపోయింది. ప్రయాణికులు భయపడి వంతెన పై నుంచి కిందకు దూకేశారు.
పొగలు రావడంతో…
రైళ్లలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. తాము ఏం చేయాలో తెలియక రైలు చైన్ లాగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బాణ్ గంగా నదిపైకి రాగానే సద్భావన ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడం ప్రారంభించాయని, వెంటనే లాగడంతో అది వంతెన మీద ఆగిందని తెలిపారు. మంటలు వ్యాపిస్తాయోమోనని భయపడి బాణ్ గంగా నదిలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. అయితే సద్భావన ఎక్స్ ప్రెస్ బ్రేక్ లు జామ్ కావడంతో పొగలు వచ్చాయని రైల్వే అదికారులు చెబుతున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.