తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 164వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. లోకేష్ వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వారు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను తమ ఎన్నికల మేనిఫేస్టో చేరుస్తానని చెబుతున్నారు.
నేడు సంతనూతలపాడుకు…
ప్రధానంగా యువతను పార్టీకి కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాలుపంచుకుంటుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్ పైనా, ప్రభుత్వ పనితీరు పైనా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చీమకుర్తి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. చీమకుర్తిలో జరగనున్న సభలో లోకేష్ ప్రసంగించిన అనంతరం రాత్రికి సంతనూతలపాడుకు చేరుకుంటారు. లోకేష్ పాదయాత్ర కోసం టీడీపీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. వర్షంలోనూ లోకేష్ తన పాదయాత్రకు విరామం ప్రకటించకుండా ముందుకు సాగుతున్నారు.