తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో పదిహేను మందిని నిందితులుగా గుర్తించినట్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు తెలిపారు. ఈ పదిహేను మంది తమ నేరాన్ని అంగీకరించారని అధికారులు వెల్లడించారు. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే పదిహేను మంది నిందితుల తమ నేరాన్ని అంగీకరించారని సిట్ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకూ…
ఇప్పటి వరకూ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో 90 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెలాఖరులోగా మరో పది మందిని అరెస్ట్ చేయనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి తమ విచారణ ప్రారంభమయిందని, ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నికోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. మరికొందరి పేర్లను త్వరలోనే బయటపెడతామని సిట్ అధికారులు తెలిపారు.