మంత్రాలయంలో నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి విగ్రహం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని మంత్రాలయానికి ఈ విగ్రహం మరింత శోభ తేనుంది.
మూడు వందల కోట్లతో…
108 అడుగుల ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయంలోని శ్రీమఠానికి కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం నిర్మాణం కోసం మూడు వందల కోట్ల రూపాయలు వెచచించనున్నారు. 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని రెండేళ్లలో నిర్మించనున్నారు. జైశ్రీరామ్ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని నిర్మించనుంది. మొత్తం పది ఎకరాల్లో శ్రీరాముడి విగ్రహాన్నిఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం ఏర్పాటయితే ఆధ్యాత్మికంగా మంత్రాలయంలో మరింత రద్దీ పెరగనుంది.