వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెస్టిండీస్ లో నిన్నంతా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా డిక్లేర్ చేశారు. దీంతో ఒక మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ టెస్ట్ మ్యాచ్ ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సిరీస్ ను సొంతం చేసుకున్నామన్న ఆనందం లేకపోగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. డ్రాగా ముగియపోకుంటే, నిన్నటి మ్యాచ్ లో గెలిచి ఉంటే భారత్ తొలి స్థానంలో ఉండేది.
రెండో స్థానంతో…
వరల్డ్ టెస్ట్ మ్యాచ్ ఛాంపియన్ షిప్ లో ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది. శ్రీలంకతో తొలి టెస్ట్ లో ఘన విజయం సాఢించిన పాక్ వంద శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. నిన్నటి వెస్టిండీస్ మ్యాచ్ జరిగి ఉంటే భారత్ గెలిచి ఉంటే అగ్ర స్థానంలో నిలిచే వీలు చిక్కేది. క్లీన్ స్వీప్ చేసి ఉంటే తిరుగు లేకుండా ఉండేది. వర్షం అడ్డంకి గా మారడం భారత్ కు మ్యాచ్ పరంగా, ర్యాంకింగ్ పరంగా శాపంగా మారింది. దీంతో ర్యాంకింగ్ లో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.