తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 2177 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో లోకేష్ ఉన్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరతారు. 4.45 గంటలకు సంతనూతలపాడులో నారా లోకేష్ స్థానికులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలపై చర్చించనున్నారు.
వరస సమావేశాలతో…
అనంతరం లోకేష్ సంతనూతలపాడులోని బైక్ మెకానిక్స్ తో మాట్లాడతారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకుంటారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వనున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఎండ్లూరు ట్రిపుల్ ఐటీ కళాశాల వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. అనంరతం పేర్నమిట్టలో కొద్దిసేపు స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రికి ఒంగోలు శివారులోని పాలకేంద్రం వద్ద లోకేష్ బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.