పోలీసు అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. విధుల్లో ఫ్రస్టేషన్, పనిలో వత్తిడితో పాటు కుటుంబ సమస్యలతో అనేక మంది బలవన్మరణం చెందుతున్నారు. తాజాగా ఒక ఏసీపీ తన భార్యతో పాటు మేనల్లుడిని కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని పూనేలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఈరోజు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
మేనల్లుడిని కూడా…
అమ్రావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ బానర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున తొలుత భరత్ గైక్వాడ్ తన భార్య మోనీ పై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న మేనల్లుడు దీపక్ ఆ గదిలోకి వచ్చాడు. అతని మీదకూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకుని మరణించారు. ఏసీపీకి ఒకకుమారుడు ఉన్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే్స్తున్నారు.అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.