తెలంగాణ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన కేంద్ర నాయకత్వం వరస సమావేశాలతో ఇటు క్యాడర్ లోనూ అటు ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 29వ తేదీన తెలంగాణకు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నేతలతో సమావేశమై…
పార్టీలోని వివిధ వర్గాల నేతలతో అమిత్ షా ఈ సందర్భంగా సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి అమిత్ షా వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిటీలతో సమావైశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం వంటి వాటిపైనే షా దృష్టి పెట్టనున్నారు. అందుకోసం నేతలను సిద్ధం చేయడానికి అమిత్ షా హైదరాబాద్ కు ఈనెల 29వ తేదీన రానున్నారు.