గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డారు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య్ చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరదీప్ చౌదరి కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న సారదీప్ చౌదరి తీవ్రంగా గాయపడటంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బెంగాల్ కు చెందిన…
అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలను విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న విషయంలో బెంగాల్ లోని వారి బంధువులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.